సిఎం కేసీఆర్ నేడు తన గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ములుగు చేరుకొని అక్కడ కొత్తగా నిర్మించిన ఫారెస్ట్ కాలేజీ, రీసర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్త భవనాలను ప్రారంభోత్సవం చేస్తారు. తరువాత శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తరువాత గజ్వేల్ పట్టణంలో కొత్తగా నిర్మించిన సమీకృత మార్కెట్, సమీకృత కార్యాలయ భవనాలను సిఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం రూ.100 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మద్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, గజ్వేల్ పట్టణంలో రూ.32 కోట్లతో నిర్మించబోతున్న వంద పడకల మాతా-శిశు ఆసుపత్రికి సిఎం కేసీఆర్ శంఖుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొన్న తరువాత మళ్ళీ సాయంత్రం 4.30 గంటలకు సిఎం కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.