దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఈ ఘటనపై నేడు మీడియాలో వస్తున్న వార్తలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. పోలీసులు చెపుతున్నట్లు నిందితులు నిజంగా దాడి చేసి పారిపోతుంటే వారిని ఎన్కౌంటర్ చేశారా లేక ప్రజల భావోద్వేగాలను చల్లర్చేందుకు బూటకపు ఎన్కౌంటర్ చేశారా? అనే దానిపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘం డీజిని ఆదేశించింది. తక్షణం ఘటనాస్థలానికి వెళ్ళి పరిశీలించి పూర్తి వివరాలతో నివేదిక పంపించాలని ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశం ప్రకారం స్థానిక ఎస్.ఎస్.పీ. నేతృత్వంలో బృందం శుక్రవారం ఘటనాస్థలానికి బయలుదేరబోతున్నట్లు తాజా సమాచారం.