దిశ కేసు విచారణకు ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు

December 04, 2019


img

సంచలనం సృష్టించిన దిశ హత్యాచారకేసును విచారించేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు బుదవారం ఆమోదం తెలిపింది. కనుక మహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టును ఫాస్ట్-ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. బహుశః రేపటి నుంచే దిశ కేసును రోజువారీగా విచారణ చేపట్టే అవకాశం ఉంది. దిశ కేసులో నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని మహబూబ్‌నగర్‌ బార్ అసోసియేషన్ నిర్ణయించినందున బహుశః నెల రోజులలోనే కేసు విచారణ ముగిసి దోషులకు శిక్షలు విధించే అవకాశం ఉంది. 



Related Post