అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌గా వెంకట్ రెడ్డి

November 21, 2019


img

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తరువాత ఆమె స్థానంలో పనిచేసేందుకు అందరూ భయపడుతున్నారు. సరూర్‌నగర్‌ తహశీల్దార్‌ శ్రీనివాస్ రెడ్డి ఇన్-ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడంతో ప్రభుత్వం షేక్‌పేట తహసీల్దార్‌  వెంకట్ రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌గా నియమిస్తూ బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది. విజయారెడ్డి సజీవదహనం జరిగినప్పటి నుంచి రెవెన్యూ ఉద్యోగులు ఆ కార్యాలయంలో పనిచేయడానికి నిరాకరిస్తున్నారు. తహశీల్దార్‌ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చాలని పట్టుపడుతున్నారు. కనుక స్థానికంగా మరో భవనాన్ని అధికారులు ఎంపిక చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న వెంకట్ రెడ్డి దానిని పరిశీలించిన తరువాత అందరికీ ఆమోదయోగ్యమైతే దానిలోకి తహశీల్దార్‌ కార్యాలయాన్ని తరలిస్తారు. 


Related Post