ఆరుగురు తెరాస ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ శుక్రవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. నన్నపునేని నరేందర్ (వరంగల్-తూర్పు), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), మెతుకు ఆనంద్ (వికారాబాద్), పట్నం నరేందర్ రెడ్డి (కొడంగల్), కె.మహేశ్ రెడ్డి (పరిగి), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజిగిరి) ఎమ్మెల్యేలను నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని కేసును అప్పటికి వాయిదా వేసింది. ఈ కేసులకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.