హైదరాబాద్‌లో 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలో గృహాప్రవేశాలు

November 14, 2019


img

హైదరాబాద్‌లో కూకట్‌పల్లి పరిధిలోని చిత్తారమ్మ బస్తీ, బాలానగర్‌లో ప్రభుత్వం నిర్మించిన 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలోకి లబ్దిదారులు గురువారం గృహాప్రవేశాలు చేశారు. మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో లబ్దిదారులు గృహాప్రవేశాలు చేశారు. తమ జీవితంలో సొంత ఇల్లు ఏర్పరచుకోగలమని కలలోనైనా ఊహించలేదని కానీ సిఎం కేసీఆర్‌ దయ వలన తమకు ఈ భాగ్యం దక్కిందని లబ్దిదారులు చాలా సంతోషంతో పొంగిపోయారు. ఎన్నో ఏళ్లుగా చిన్న షెడ్లు, పూరిగుడిసెలలో నివశిస్తున్న తమకు ప్రభుత్వం ఇంత చక్కటి ఇళ్ళు నిర్మించి ఉచితంగా ఇచ్చినందుకు వారు పదేపదే మంత్రులకు, సిఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అందరూ కొత్త బట్టలు కట్టుకొని ఎంతో ఆనందంగా గృహాప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా వారందరికీ మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.



Related Post