గురువారం మధ్యాహ్నం హుజూర్నగర్లో జరుగవలసిన సిఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారసభ వర్షం కారణంగా రద్దయింది. ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొన్నందున సిఎం కేసీఆర్ బహిరంగసభ నిర్వహించినట్లయితే తెరాస అభ్యర్ధి సైదిరెడ్డికి కలిసివస్తుందనుకుంటే వర్షం కారణంగా సభ రద్దయింది. ఒకవేళ ఈరోజు సిఎం కేసీఆర్ సభ నిర్వహించగలిగి ఉండి ఉంటే ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని స్వయంగా ప్రజలకు చెప్పగలిగి ఉండేవారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది కనుక ఆలోగా సిఎం కేసీఆర్ హుజూర్నగర్కు రగలిగితే సభ నిర్వహించడానికి అవకాశం ఉంది.