పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుదవారం డిల్లీలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నవంబర్ 18నుంచి డిసెంబర్ 13వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాల జరపాలని నిర్ణయించారు. త్వరలోనే మరోసారి సమావేశమయ్యి పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చర్చించవలసిన అంశాలకు సంబందించి అజెండాను ఖరారు చేస్తారు. దేశంలో ఆర్ధికమాంద్యం కారణంగా పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం, తత్ఫలితంగా దేశ ఆర్ధిక పరిస్థితి బలహీనపడుతుండటం, అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు మొదలైన అంశాలపై పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అధికార ప్రతిపక్షాల మద్య వాదోపవాదాలు జరుగవచ్చు.