తెలంగాణ సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) ఊహించినట్లుగానే సాంకేతిక కారణాలను చూపి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. తన వాదనకు మద్దతుగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు. పిటిషనర్ వాదనలు కూడా విన్న ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఒకవేళ హైకోర్టు సానుకూలంగా తీర్పు చెపితే సచివాలయం కూల్చివేత పనులు వెంటనే మొదలుపెట్టవచ్చు కానీ హైకోర్టు అభ్యంతరం చెపితే, తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళకతప్పదు.