టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు

September 18, 2019


img

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల సంఖ్యను 18 నుంచి 24కు పెంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. 

తెలంగాణ రాష్ట్రం నుంచి జూపల్లి రామేశ్వరరావు, పుట్టా ప్రతాపరెడ్డి, బి. పార్థసారథి రెడ్డి, డి. దామోదర్ రావు, యూ. వెంకట భాస్కరరావు, కె. శివకుమార్, మూరషెట్టి రాములు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. 

ఏపీ నుంచి నాదేండ్ల సుబ్బారావు, వి. ప్రశాంతి, డీపీ అనిత, చిప్పగారి ప్రసాద్ కమార్, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి గొల్ల బాబురావు, యూవి.రమణమూర్తి, మల్లికార్జున్‌రెడ్డి మొత్తం 8 మంది సభ్యులుగా నియమితులయ్యారు.  

తమిళనాడు: కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తవరపు, ఎమ్మెల్యే కుమరగురు.  

కర్ణాటక:  సుధా నారాయణమూర్తి, సంపత్ రవి, నారాయణ రమేశ్ శెట్టి. 

మహారాష్ట్ర: రాజేశ్ శర్మ

డిల్లీ: ఎమ్ ఎస్ శివ శంకరన్ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు.


Related Post