గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకోగా, కేసీఆర్ ఆయనకు అభినందనలు తెలియజేశారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో గుత్తాకు సిఎం కేసీఆర్ అవకాశం కల్పించారు.