సిద్ధిపేటలో గ్యాంగ్ రేప్!

August 24, 2019


img

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కటినమైన చట్టాలు తెస్తున్నప్పటికీ దేశంలో మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సిద్ధిపేట 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసు నమోదు అయింది. సిద్ధిపేటలో నివశిస్తున్న దుండిగల్‌కు చెందిన ఒక మహిళపై  జిల్లాలోని పెద్దలింగారెడ్డి పల్లికి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఆ వ్యక్తితో ఆమెకు పరిచయం ఉండటంతో అతని మాటలు నమ్మి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లింది. అక్కడ అతను తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ మహిళ సిద్ధిపేట 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 



Related Post