కొండా దంపతులు బిజెపిలోకి?

July 17, 2019


img

కొండా సురేఖ, ఆమె భర్త మురళి బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. అయితే 2023లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ కుమార్తెకు భూపాలపల్లి టికెట్ కేటాయించాలని వారు షరతు పెడుతున్నట్లు సమాచారం. కానీ గత ఎన్నికలలో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ బిజెపిలో చేరాలనుకొంటున్నారు. ఆయన కూడా భూపాలపల్లి టికెట్ కోసం పట్టుబడుతుండటంతో కొండా దంపతుల చేరికపై సందిగ్దత నెలకొనుంది. భువనగిరి టికెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తేనే కొండా దంపతులు బిజెపిలో చేరాలనుకొంటునట్లు తెలుస్తోంది. వారిరువురిలో ఎవరు బిజెపిలో చేరుతారనే విషయం పక్కన పెడితే, ఇప్పటి వరకు ఎన్నికలొచ్చిన ప్రతీసారి బిజెపి అభ్యర్ధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఉండేది కానీ 2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే బిజెపిలో అభ్యర్ధుల మద్య పోటీ ఏర్పడుతుండటం ఆసక్తికరంగానే ఉంది.  



Related Post