మరో రెండు రోజులలో సుందిళ్ళకు చేరనున్న నీళ్ళు

July 16, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీకి నీళ్ళు తరలిస్తున్నారు. గత ఆదివారంనాడు కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మూడు పంపులను మాత్రమే నడిపించగా నిన్నటి నుంచి 5 పంపులను నిర్విరామంగా నడిపిస్తూ 10 పైపుల ద్వారా నీటిని గ్రావిటీ కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. సోమవారం సాయంత్రానికి గోదావరి జలాలు పెద్దపల్లి జిల్లా కాసిపేటలోని అన్నారం బ్యారేజీకి చేరుకొన్నాయి. ప్రస్తుతం మేడిగడ్డలో 6.8 టీఎంసీలు, నీళ్ళున్నాయి. అన్నారం బ్యారేజీ నీటి నిలువ సామర్ధ్యం 10.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలున్నాయి. కనుక బ్యారేజీలో పూర్తి స్థాయికి నీళ్ళు చేరుకోగానే సుందిళ్ళ  బ్యారేజీకి నీటిని ఎత్తిపోస్తారు. మరొక రెండు మూడు రోజులలో అన్నారం నుంచి సుందిళ్ళకు నీళ్ళు విడుదలయ్యే అవకాశం ఉంది. 





Related Post