నయీం తల్లి తాహెరా బేగమ్ అరెస్ట్...రిమాండ్

July 16, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడించిన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ తల్లి తాహెరా బేగంను భువనగిరి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రెండువారాలు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. నయీం చేసిన భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాపులు, అక్రమవసూళ్ళలో ఆమె కూడా కీలకపాత్ర పోషించిందనే ఆరోపణలతో పోలీసులు ఆమెపై 12 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నయీం చనిపోయిన తరువాత వందలాదిమంది బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని పిర్యాదులు చేయడంతో వాటి ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు నయీం తల్లి తాహెరా బేగంపై కూడా కేసులు నమోదు చేశారు. ఆమెను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కుంట్లూరులో అరెస్ట్ చేశారు.          



Related Post