మన తెలుగు సినీ పరిశ్రమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఎవరో వేరే చెప్పకరలేదు. ప్రముఖ హాస్యనటుడు పృద్వీకి ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి చాలా విలువైన గిఫ్ట్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీ తరపున చురుకుగా పనిచేసినందుకుగాను ఆయనకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబీసీ)కి ఛైర్మన్గా నియమించారు.
చంద్రబాబునాయుడు హయాంలో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఎస్విబీసీ ఛైర్మన్గా ఉండేవారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ బోర్డులో మార్పులకు సిద్దం అవుతున్నప్పుడు ఆయన టీటీడి సభ్యత్వానికి, ఎస్విబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి గౌరవంగా తప్పుకున్నారు.
ఆ పదవి పృధ్వీకి లభిస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో దానికోసం వైసీపీలో ఆశ పడుతున్నవారు చాలా నిరాశ చెంది ఉండవచ్చు. కానీ ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనుభవమున్న పృధ్వీకి ఎస్విబీసీని అప్పగించినందున దానిని మరింత చక్కగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.