జగన్మోహన్రెడ్డి ఏపీ సిఎంగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా చురుకుగా కీలక నిర్ణయాలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే. ఆయన అధ్యక్షతన అమరావతిలో బుదవారం శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసి) సమావేశమైంది. రేపటి నుంచి ఈ నెల 30వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది. మొత్తం 20 రోజులలో 14 పనిదినాలలో శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.
రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జూలై 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 సం.లకు పూర్తి బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నందున దానికోసం మంత్రి కన్నబాబు ఆదేరోజున వేరేగా బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి ‘నవరత్నాలు’ పేరిట ప్రకటించిన 9 హామీల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు కనుక ఈ బడ్జెట్లో వాటికే భారీగా నిధులు కేటాయించవచ్చు. కానీ వాటికి అవసరమైన భారీ నిధులు ఏవిధంగా సమకూర్చుకోవాలనుకొంటున్నారనే విషయం బడ్జెట్ చూస్తే కానీ చెప్పడం కష్టం.