తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త. మళ్ళీ మూడు నెలల వరకు సరైన ముహూర్తాలు లేనందున మంగళవారం (మాఘశుద్ధ నవమి) ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించిన్నట్లు తాజా సమాచారం. మంత్రివర్గంలో మరొక ఆరుగురికి అవకాశం ఉంటుంది. వాటిలో రెండు మంత్రి పదవులు మహిళలకు కేటాయిస్తానని సిఎం కేసీఆర్ చెప్పి ఉన్నందున ఇంకా నాలుగు మంత్రి పదవులు మిగులుతాయి. వాటిలో కేటీఆర్, హరీష్రావులకు చెరొకటీ కేటాయిస్తే మరో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికలలో 7 స్థానాలలో పార్టీ ఓటమికి బాధ్యులుగా భావిస్తున్న ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మరో ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుంది. ఈ వార్తను తెరాస ఇంకా దృవీకరించవలసి ఉంది.