సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

June 21, 2019


img

సూర్యపేట జిల్లాలో చిలుకూరు మండలంలో మిట్స్ కాలేజీ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా కురివి మండలంలోని చింతపల్లికి చెందినవారుగా గుర్తించారు. వారందరూ ఆటోలో జానపహాడ్‌కు వెళ్ళి తిరిగి వస్తుండగా మిట్స్ కాలేజీ వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను డ్డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురు క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకొని లారీని స్వాధీనం చేసుకొని, డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. మృతుల, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 



Related Post