త్వరలో సర్పంచ్‌లకు చెక్‌పవర్‌: ఎర్రబెల్లి

June 15, 2019


img

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం తన కార్యాలయంలో మిషన్ భగీరధ పనుల పురోగతిపై సంబందిత అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించినప్పుడు వారం, పది రోజులలో సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. చెక్‌పవర్‌తో పాటు వారికి అధికారాలు కూడా ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. 

కొత్త ప్రభుత్వం  ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వకపోవడంతో గ్రామాలలో పనులు నిలిచిపోయాయని, కనుక తక్షణమే వారికి చెక్ పవర్ మంజూరు చేయాలాని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నల్గొండలో సర్పంచులు శుక్రవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యలయం ఎదుట భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఎట్టకేలకు మంత్రి ఎర్రబెల్లి స్పందించి, మరో వారం పది రోజుల తరువాత సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇస్తామని చెప్పారు.       



Related Post