సీనియర్ బిజెపి నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం విశేషం. అయితే ఆయన లోక్సభ ఎన్నికలలో గెలిచిన తరువాత, మంత్రిపదవి చేపట్టక మునుపు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనను హత్య చేస్తానని ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని కిషన్రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే గత నెల 20న బెదిరింపు కాల్స్ వస్తే కిషన్రెడ్డి ఇన్ని రోజులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో? అర్ధం కాదు.