నేడు ముంబై వెళ్లనున్న సిఎం కేసీఆర్‌

June 14, 2019


img

సిఎం కేసీఆర్‌ నేడు ముంబై వెళ్ళనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభోత్సవం చేయనున్నందున ఆ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను స్వయంగా ఆహ్వానించేందుకు సిఎం కేసీఆర్‌ ఈరోజు ఉదయం 10.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేకవిమానంలో ముంబై వెళ్ళనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అవుతారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీని, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కూడా సిఎం కేసీఆర్‌ ఆహ్వానించబోతున్నారు. 



Related Post