ఇటీవల బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “ఎగ్జిట్ పోల్స్ చూసిన తరువాత ఏపీలో టిడిపి ఓడిపోతుందని గ్రహించిన చంద్రబాబునాయుడు తన భయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే డిల్లీలో డ్రామాలు ఆడుతున్నారు. కేంద్రంలో మళ్ళీ బిజెపియే రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్పినప్పటికీ, మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తే ఆయనతో చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినప్పటికీ బాబు డిల్లీలో హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు డ్రామాలన్నీ మే23తో ముగిసిపోనున్నాయి,” అని అన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించబోతోందని కొన్ని సర్వే సంస్థలు, టిడిపి గెలుస్తుందని కొన్నీ చెప్పాయి. కనుక ఆ రెండు పార్టీల నేతలు తీవ్ర ఆందోళనతో ఉండటం సహజం. కానీ కేంద్రంలో బిజెపి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని అన్ని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చెప్పడంతో కాంగ్రెస్తో సహా మిత్రపక్షాలన్నీ వెనక్కు తగ్గినప్పుడు, చంద్రబాబు ఒక్కరే ఎందుకు అంత హడావుడి చేస్తున్నారో తెలియదు. సుధాకర్రెడ్డి చెప్పినట్లు బహుశః తన ఆందోళనను అధిగమించడానికే డిల్లీలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కాలక్షేపం చేస్తున్నారేమో?