ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్‌

May 21, 2019


img

ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికవడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఒక్క స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్‌ నేడు వెలువడనుంది. నేటి నుంచి ఈ నెల 28వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న వాటి పరిశీలన, 31వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువమంది పోటీపడితే జూన్ 7వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ శాసనసభ్యుల కోటాలో జరుగబోయే ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలకు తగినంతబలం లేదు కనుక అవి పోటీచేయకపోవచ్చు. కనుక తెరాస అభ్యర్ధి ఏకగ్రీవం ఎన్నిక లాంఛనప్రాయమేనాని భావించవచ్చు. మే 23న ఫలితాలు వెలువడిన తరువాత తెరాస అభ్యర్ధిని ప్రకటించవచ్చునని సమాచారం.     



Related Post