ఏపీలో 5 చోట్ల రీపోలింగ్!

April 17, 2019


img

లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు నియోజకవర్గాలలో ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు జరిగాయి. అనేక చోట్ల ఈవీఎంల మొరాయించడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. కానీ రాష్ట్రంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది సమర్ధించుకొన్నారు. కానీ జిల్లా కలెక్టర్ల నివేదికల మేరకు గుంటూరులో రెండు చోట్ల, నెల్లూరులో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీ-పోలింగ్ నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ వ్రాసినట్లు ద్వివేది చెప్పారు. విశాఖ, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలో పోలింగ్ సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించామని, ఈసీ ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడతామని ద్వివేది తెలిపారు.



Related Post