రేపు 2వ దశ పోలింగ్

April 17, 2019


img

లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశలలో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఏప్రిల్ 11న మొదటిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు అంటే ఏప్రిల్ 18వ తేదీన దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో మొత్తం 97 నియోజకవర్గాలలో రెండవ దశ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో కర్ణాటక: 14, మహారాష్ట్ర: 10, యూపీ: 8, అసోం: 5, బీహార్:5, పశ్చిమబెంగాల్:3, ఛత్తీస్ ఘడ్:3, జమ్మూ కశ్మీర్:2, మణిపూర్:1, త్రిపుర:1 పుదుచ్చేరి:1 స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. 

మళ్ళీ ఈ నెల 23న దేశంలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం 115 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 

ఆ తరువాత మళ్ళీ ఏప్రిల్ 26, మే 6, 12,19 తేదీలలో వరుసగా పోలింగ్ జరుగుతుంది. మే 23న ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. 


Related Post