తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు శాసనమండలి స్థానాలకు నేడు పోలింగ్ మొదలైంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ రెండు ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు పోలింగు జరుగుతోంది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈనెల 26న ఓట్ల లెక్కింపు చేస్తారు కానీ ఫలితాలను ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని పార్టీలు వేర్వేరు అభ్యర్ధులకు మద్దతు తెలుపుతున్నందున పరోక్షంగా పార్టీల మద్య పోటీ జరుగుతున్నట్లు భావించవచ్చు.