కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మలు: తలసాని

March 21, 2019


img




మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుదవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మలు. వారికి పార్టీని ఏవిధంగా నడిపించుకోవాలో తెలియక మామీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళలో వాళ్ళకే పడక కొట్టుకు చస్తున్నారు. మతాన్ని నమ్ముకొని అమ్ముకొని బ్రతికే పార్టీ బిజెపి. అసెంబ్లీ ఎన్నికలలో 117 స్థానాలలో పోటీ చేస్తే 103 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయారు. బిజెపి నేతలు మోడీ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకొన్నప్పటికీ ఆయన దేశానికి చేసిందేమీ లేదు. తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొంటే కేంద్రం మెడలు వంచి అన్ని సాధించుకొంటుంది. చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. భయపడి అమరావతికి పారిపోయాడు. అతనో మోసగాడు. ఏపీ ప్రజలు అతనిని గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారు. విజయవాడలో ఒక ఫ్లై ఓవరు కట్టలేకపోయాడు ఇక రాజధాని అమరావతి ఏమి కట్టగలడు? త్వరలో జరుగబోయే ఎన్నికలలో వైసీపీ ఘనా విజయం సాధించబోతోంది. 120-130 అసెంబ్లీ సీట్లు, 22-23 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకోవడం ఖాయం. జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం...చంద్రబాబునాయుడు ఇంటి ముఖం పట్టడం ఖాయం,” అని తలసాని అన్నారు. 



Related Post