లోక్సభ ఎన్నికలలో తెలంగాణ జనసమితి కూడా రెండు లేదా మూడు సీట్లకు పోటీ చేయబోతున్నట్లు కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బాక్సు (పెట్టె) గుర్తును కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర పార్టీలకు కూడా వేర్వేరు ఎన్నికల గుర్తులు కేటాయించింది.
ఈసారి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ సహకరిస్తే 2-3 స్థానాలలో తమ అభ్యర్ధులను నిలబెట్టి మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోదండరాం భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ 17స్థానాలలో సొంతంగా పోటీ చేస్తోంది. కనుక కాంగ్రెస్ పార్టీతో కూడా టిజేఎస్ పోటీపడవలసి ఉంటుంది. అందుకు టిజేఎస్ సిద్దమవుతుందా లేక కాంగ్రెస్కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకొంటుందో చూడాలి.