మాజీ రక్షణమంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర పారికర్ (63)ఆరోగ్యపరిస్థితి విషమించినట్లు గోవా సిఎం కార్యాలయం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. ఆయన గత కొంతకాలంగా ప్యాంక్రియాటిక్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దానికోసం అమెరికా వెళ్ళి చికిత్స చేయించుకొన్నప్పటికీ అమెరికా నుంచి తిరిగివచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. నిన్నటి నుంచి ఆయన పరిస్థితి విషమించిందని, ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని గోవా సీఎంఓ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. కనుక బిజెపి అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని గోవా ముఖ్యమంత్రిగా నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
తాజా సమాచారం: మనోహర పారిక్కర్ ఆదివారం రాత్రి సుమారు 8.05 గంటలకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.