జనసేనలోకి జెడి లక్ష్మినారాయణ

March 17, 2019


img

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఆదివారం ఉదయం జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సిలర్ రాజగోపాల్‌ కూడా జనసేనలో చేరారు. వారిరువురినీ పవన్‌కల్యాణ్‌ సాధారంగా పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. 

అనంతరం లక్ష్మినారాయణ మీడియాతో మాట్లాడుతూ, “జనసేన పార్టీ విధానాలు...పవన్‌కల్యాణ్‌ ఆలోచనలు, ఆశయాలు నచ్చడంతో జనసేనలో చేరుతున్నాను. జనసేనలో నన్ను చేర్చుకొన్నందుకు పవన్‌కల్యాణ్‌ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇంతవరకు మాటలు చెప్పే పార్టీలను మాత్రమే చూశాము కానీ మనం పనిచేసి చూపించి చేతలలో మనమేమీటో నిరూపించుకొందాము. దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించేందుకు అందరం కలిసి కృషి చేద్దాం,” అని అన్నారు. 

లక్ష్మినారాయణ మొదట తెలుగుదేశంలో పార్టీ చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరికి తన ఆలోచనలకు, ఆశయాలకు దగ్గరగా ఉన్న జనసేనలో చేరారు. ఈసారి జనసేన పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తోంది కనుక లక్ష్మినారాయణ కూడా తప్పకుండా పోటీ చేయడం ఖాయమేనని భావించవచ్చు. ఒకటి రెండు రోజులలోనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వస్తుంది.


Related Post