రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి రోజుకో ఎమ్మెల్యే పార్టీని వీడి తెరాసలో చేరిపోతూనే ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సిఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ప్రజాభిప్రాయాన్ని మన్నించి నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసలో చేరాలని నిశ్చయించుకొన్నాను. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించిన నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. తెరాసలో ఎప్పుడు చేరబోయేది త్వరలోనే తెలియజేస్తాను,” అని చెప్పారు.
వనమా వెంకటేశ్వరరావు ఫిరాయింపుతో ఈ 10 రోజుల వ్యవదిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 19 నుంచి 11కు పడిపోయింది. ఇప్పటి వరకు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్ను వీడి తెరాసలో చేరబోతున్నట్లు సమాచారం.