సమైక్యరాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున కడప జిల్లా పులివెందలలో తన స్వగృహంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన కడప నించి లోక్సభకు రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి రెండుసార్లు (1989, 1994) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.