సుల్తాన్‌పూర్ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారులో సజీవ దహనం

February 20, 2019


img

అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పయనిస్తున్న ఒక కారు(టీఎస్‌07 జీఎం4666)లో హటాత్తుగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే సజీవ దహనం అయ్యాడు. మరోవ్యక్తి అతికష్టం మీద బయటపడి ప్రాణాలు దక్కించుకోగలిగాడు. బుదవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కారుకు మంటలు అంటుకోవడం చూసి పరుగున వచ్చి మంటలు ఆర్పుతూ కారులో చిక్కుకొన్న వారిని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. కానీ వారందరూ చూస్తుండగానే ద్రవింగ్ సీటులో ఉన్న వ్యక్తి మంటలలో సజీవ దహనం అయిపోయాడు. కొద్దిసేపటి తరువాత అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసుల సమాచారం ప్రకారం లక్ష్మి అనే మహిళ పేరుపై ఆ కారు రిజిస్టర్ అయ్యుంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బొల్లారం వైపు నుంచి ముత్తంగికి వెళుతున్నారు. షార్ట్ సక్యూట్ లేదా గ్యాస్ లీకేజ్ ఈ అగ్నిప్రమాదానికి కారణం అయ్యుండవచ్చు. చనిపోయిన వ్యక్తి తాలూకు వివరాలు తెలియవలసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. 


Related Post