అదిలాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు

February 19, 2019


img

ఆదిలాబాద్‌ జిల్లాలో తంసీ మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా తెరాస ఎంపీ నాగేశ్, ఎమ్మెల్యే జోగు రామన్న,  జిల్లా పరిషత్ ఛైర్మన్ వి శోభారాణి తదితరులు లబ్ధిదారులతో కలిసి గృహాప్రవేశ పూజాకార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆరెకరాల విస్తీర్ణంలో రూ. 6.29 కోట్లు వ్యయంతో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించబడ్డాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు అయిన తరువాత జిల్లా కలెక్టర్ డి దివ్య వాటి నిర్మాణంపై ప్రత్యేకశ్రద్దపెట్టి తరచూ స్వయంగా నిర్మాణపనుల పురోగతిని పర్యవేక్షిస్తుండటంతో కేవలం 20 నెలలలో 100 ఇళ్ళు నిర్మాణం పూర్తయ్యాయి.  ఈ సందర్భంగా ఎంపీ నాగేశ్ విలేఖరులతో మాట్లాడుతూ, “డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో సహా ఎన్నికల హామీలన్నిటినీ నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో సొంత ఇల్లులేని పేదకుటుంబాలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేదే మా ప్రభుత్వం ఆశయం,” అని అన్నారు. 



Related Post