ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కనుక రెండు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది.
నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 21 నుంచి 28వరకు
నామినేషన్ల పరిశీలన: మార్చి 1వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 5వ తేదీ
పోలింగ్: మార్చి 15వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
పదవీకాలం పూర్తి చేసుకొన్న ఎమ్మెల్సీలు:
తెలంగాణ: పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహమూద్ అలీ, మహమ్మద్ సలీం, టి.సంతోష్ కుమార్.
ఆంధ్రప్రదేశ్: యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, పి.శమంతకమణి, ఏ. లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు.