అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరుగబోతోంది కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల పేర్లు ఖరారు చేశారు. మొత్తం 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), జి.జగదీశ్వర్ రెడ్డి (నల్గొండ), ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), వేముల ప్రశాంత్ రెడ్డి (నిజామాబాద్), అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్.నిరంజన్ రెడ్డి (మహబూబ్నగర్) ఉన్నారు. రేపు ప్రమాణస్వీకారం చేయబోయే కొత్త మంత్రులకు వెంటనే శాఖలను కేటాయించబోతున్నట్లు సమాచారం. మొదటివిడత విస్తరణలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులకు అవకాశం కల్పించకపోవడం ఆశ్చర్యకరమే. అలాగే కనీసం ఒక్క మహిళనైనా మంత్రివర్గంలోకి తీసుకొంటారని అందరూ భావించినప్పటికీ ఎవరికీ అవకాశం కల్పించలేదు. లోక్సభ ఎన్నికల తరువాత మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని సమాచారం.