నాంపల్లి ఎగ్జిబిషన్‌ 24 వరకు పొడిగింపు

February 15, 2019


img

నాంపల్లి ఎగ్జిబిషన్‌(నుమాయిష్)ను ఈనెల 24వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి జివి రంగారెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఇటీవల ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో సుమారు 130 దుఖాణాలు దగ్ధమైపోయాయి. ఆ కారణంగా వ్యాపారులు భారీగా నష్టపోయారు. వారికి రూ. 2.58 కోట్లు నష్టపరిహారం చెల్లించామని సొసైటీ కార్యదర్శి జివి రంగారెడ్డి తెలిపారు. మళ్ళీ అటువంటి అగ్నిప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని ప్రభుత్వానికి, అగ్నిమాపకశాఖ, పోలీసులకు తెలిపి ఎగ్జిబిషన్‌ను 24వరకు పొడిగించేందుకు అనుమతి పొందామని తెలిపారు.  



Related Post