ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్తో పోటీపడి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి సిఎం కేసీఆర్ సమక్షంలోనే శుక్రవారం సాయంత్రం తెరాసలో చేరబోతున్నట్లు ఆయన కుమారుడు మీడియాకు తెలియజేశారు. అయితే ఆయన వచ్చి చేరుతామన్నా పార్టీలో చేర్చుకోబోమని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో వంటేరు రేపు తెరాసలో చేరుతారో లేదో చూడాలి.