మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసనసభాపతి పదవికి ఈరోజు నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా సీఎం కేసీఆర్తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్ బలాల, సురేఖా నాయక్, అబ్రహంలు ప్రతిపాదనలు దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సిఎం కేసీఆర్ పోచారం పేరును ప్రతిపాదించినప్పుడు ఇక తెరాసలో వేరెవరూ నామినేషన్ వేసే ఆలోచన చేయరు కనుక పోచారం ఎన్నిక లాంఛనప్రాయమేనని భావించవచ్చు.