తెరాస శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కేసీఆర్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన తరువాత మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కేసీఆర్ తెలుగులో ప్రమాణస్వీకారం చేయగా, మహమూద్ ఆలీ ఉర్దూలో ప్రమాణస్వీకారం చేశారు. నాలుగైదు రోజులలోగా మిగిలిన మంత్రుల పేర్లను వారి మంత్రివర్గాలను కూడా ఖరారు చేసిన తరువాత వారందరి చేతా ఒకేసారి ప్రమాణస్వీకారం చేయిస్తానని కేసీఆర్ చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో నలుగురు సీనియర్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, చందూలాల్ ఓడిపోవడంతో వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవలసి ఉంది. అలాగే మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి కూడా ఓడిపోవడంతో స్థానంలో కొత్తవ్యక్తికి అవకాశం ఏర్పడింది. కనుక ఈసారి ఎవరెవరికి కొత్తగా అవకాశం లభిస్తుందో చూడాలి.