తెలంగాణ ఎన్నికలలో వేలు పెట్టినందుకు ప్రతిగా తాము కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో వేలుపెట్టి చంద్రబాబు నాయుడుకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మనది ప్రజాస్వామ్యదేశం. ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు రావచ్చు. కొందరు అటూ ఇటూ లులూచీ పడవచ్చేమో కానీ మేము మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రజల కోసమే పనిచేస్తున్నాము,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్పై చాలా తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇంత మెతకగా స్పందించడం చూస్తే కేసీఆర్ ఇస్తానంటున్న ‘రిటర్న్ గిఫ్ట్’ కారణంగా ఆయనలో మళ్ళీ ఆందోళన మొదలైందేమో? అనే సందేహం కలుగుతోంది.