మంగళవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. కనుక అన్ని రాష్ట్రాలలో పార్టీలు తమతమ ఎంపీలతో గత రెండుమూడు రోజులుగా సమావేశాలు నిర్వహించుకొంటూ పార్లమెంటు సమావేశాలలో ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై చర్చించుకొంటున్నాయి. బిజెపిని వ్యతిరేకిస్తున్న 14 ప్రాంతీయ పార్టీల అధినేతలు నేడు డిల్లీలో సమావేశం కానున్నారు. వారు కూడా రేపటి నుంచి మొదలవబోతున్న పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై చర్చిస్తారు. రేపే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. కనుక వాటిలో కాంగ్రెస్, బిజెపి పార్టీలలో ఏది ఎక్కువ రాష్ట్రాలలో విజయం సాధిస్తే, ఈసారి సమావేశాలలో దాని గొంతు మరికాస్త బిగ్గరగా వినిపించే అవకాశం ఉంది.