ప్రముఖ సినీతారలు లేదా ప్రజాధారణ ఉన్నవారిచేత ఎన్నికల ప్రచారం చేయించుకోవాలంటే అభ్యర్ధులు వారికి తెర వెనుక తృణమో పణమో ముట్టజెప్పడం సహజమే. కానీ ఒక రాజకీయపార్టీనేతను నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండేందుకు కూడా భారీగా డబ్బు ఆఫర్ చేస్తే ఆశ్చర్యమే కదా!
మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అటువంటి బంపర్ ఆఫర్ వచ్చిందిట. నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాకుండా ఉంటే రూ. 25 లక్షలు ఇస్తామని అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారుట. మహేసర్ రెడ్డి అనుచరుడు ఒకరు తనకు ఫోన్ చేసి ఈ ఆఫర్ ఇచ్చినట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. దానికి సంబందించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.