మహాకూటమిపై కిషన్ రెడ్డి కామెంట్స్

November 20, 2018


img

బిజెపి నేత కిషన్ రెడ్డి మహాకూటమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మహాకూటమిలో పార్టీలు సీట్ల సర్దుబాట్లు చేసుకోలేక రెండు నెలలు తిప్పలు పడ్డాయి. అయినా 119 స్థానాలుంటే మూడు పార్టీలు పోటాపోటీగా 130 నామినేషన్లు వేశాయి. మహాకూటమి ఆరంభంలోనే వైఫల్యం చెందిందనడానికి ఇదే నిదర్శనం. పరస్పర అవగాహన లేకుండా ఎన్నికలకు వెళుతున్న మహాకూటమి రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించగలుగుతుంది?” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

కేసీఆర్‌ను ఉద్దేశ్యించి, “ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్‌ వారిని మోసం చేశారు. మరోపక్క ఓట్ల కోసం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలకు ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తెరాస ప్రభుత్వం పంచిపెట్టింది. కులమతాలను వద్దంటూనే కులాలు, మతాలవారీగా ఓటర్లతో తెరాస నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమి భయంతోనే సిఎం కేసీఆర్‌ యాగాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా డిసెంబరు 11వ తేదీన ఆ కుర్చీలో నుంచి దిగిపోక తప్పదు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 


Related Post