టిఎల్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ఆదివారం విడుదల చేసింది. విశేషమేమిటంటే, గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి ఆహ్వానం అందుకొని ఎల్బీ నగర్ నుంచి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేసిన బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యకు ఈసారి టిడిపి టికెట్ నిరాకరించగా కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ నుంచి టికెట్ కేటాయించింది. ఇంకా విశేషమేమిటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ అభ్యర్ధుల వివరాలు:
మిర్యాలగూడ: ఆర్.కృష్ణయ్య, సికింద్రాబాద్: కాసాని జ్నానేశ్వర్, నారాయణ్ పేట్: వామనగిరి కృష్ణ, నారాయణ్ ఖేడ్: సురేశ్ కుమార్ షెట్కర్, కొరట్ల: జువ్వాడి నర్సింగ్ రావు, దేవరకద్ర: డా.పాబన్ కుమార్ రెడ్డి