ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన గతంలో టిడిపికి మద్దతు తెలిపారు.
వేణు మాధవ్ కోదాడ పట్టణంలోనే పుట్టి పెరిగారు. కనుక స్థానిక సమస్యల గురించి ఆయనకు బాగా తెలుసు. అయితే ఈసారి ఎన్నికలలో తెరాస-మహాకూటమి మద్య పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోంది కనుక కోదాడ ప్రజలు వేణు మాధవ్ ను ఆధరిస్తారో లేదో చూడాలి. కోదాడ నుంచి తెరాస, కాంగ్రెస్, బిజెపిలు ఇంకా తమ అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది. కోదాడ నుంచి బిఎల్ఎఫ్ కూటమిలో సిపిఎం అభ్యర్ధిగా బి శ్రీరాములు పోటీ చేస్తున్నారు.