కాంగ్రెస్‌, తెరాసలు బీసీలకు ఎన్ని సీట్లు కల్పించాయంటే...

November 15, 2018


img

కాంగ్రెస్‌, తెరాస పార్టీలు రెండు పార్టీలు జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించకుండా బీసీలకు తీరని         అన్యాయం చేశాయని బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య ఆరోపిస్తున్నారు. ఒక్క బిఎల్ఎఫ్ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేసినందుకు నిరసనగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చారు కూడా. 

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా ఆ ఆరోపణలను ఖండించారు. తమ పార్టీ పోటీ చేయబోతున్న 94 స్థానాలలో 21 స్థానాలను బీసీలకు కేటాయించిందని తెలిపారు.

ఇక తెరాస బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది.


Related Post