చొప్పదండి తాజా మాజీ తెరాస ఎమ్మెల్యే బోడిగె శోభకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆమె తెరాసకు గుడ్ బై చెప్పేసి ఈరోజు బిజెపిలో చేరిపోయారు. ఆమె చొప్పదండి నుంచి బిజెపి అభ్యర్ధిగా ఈరోజు నామినేషన్ కూడా వేసినట్లు సమాచారం.
చొప్పదండి నుంచి తెరాస అభ్యర్ధిగా ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి శంకర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ మేడిపల్లి సత్యం పోటీ చేస్తున్నారు.