కామారెడ్డి, బైంసాలలో రేపు రాహుల్ సభలు

October 19, 2018


img

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రంలో వరుసగా రెండు బహిరంగసభలో పాల్గొబోతున్నారు. ఆయన మహరాష్ట్రలో నాందేడ్ నుంచి రేపు మాధాహ్నం 12.30 గంటలకు బైంసా చేరుకొని బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 2.30 గంటలకు కామారెడ్డి చేరుకొని అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హైదారాబాద్ చేరుకొని సాయంత్రం ఛార్మినార్ వద్ద జరిగే రాజీవ్ సద్భావన దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత రాత్రి 7 గంటలకు మళ్ళీ డిల్లీ బయలుదేరుతారు. ఈనెల 27వ తేదీన రాహుల్ గాంధీ మళ్ళీ మరోసారి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తారు. అప్పటిలోగా మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ ముగించి, ఆ రోజున పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.     



Related Post